AP CID RRR Case: రాజద్రోహం కేసులో ఏపి సీఐడి అధికారులు అరెస్టు చేసిన వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఇటు రాష్ట్రంలోనే దేశ వ్యాప్తంగా సంచలన వార్త అయిన విషయం తెలిసిందే. సీఐడి కస్టడీ విచారణలో ఉన్న సమయంలో తన పాదాలపై కొట్టారంటూ రఘురామ కృష్ణం రాజు ఆరోపణ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే గుంటూరు జీజీహెచ్ వైద్యులు కొట్టినట్లుగా గాయాలు ఏమీ లేవనీ, పాదం రంగు మారి, కొద్ది వాపు ఉన్నట్లుగా పేర్కొన్నారు. జీజీహెచ్ వైద్యుల నివేదికపై రఘురామ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించిన గుంటూరు జీజీహెచ్ సూపర్నిటెండెంట్ భర్త వైసీపీ లో క్రియాశీల నాయకుడని, అధికార పార్టీ ప్రభావం ఉంటుందంటూ ఆ మెడికల్ రిపోర్టుపై అనుమానం వ్యక్తం చేశారు. సీఐడీ కోర్టు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు రమేష్ ఆసుపత్రిలోనూ పరీక్షలు నిర్వహించి నివేదక ఇవ్వాలని ఆదేశిస్తే పోలీసులు మాత్రం కేవలం జీజీహెచ్ లోనే పరీక్షలు చేయించి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లలేదని సుప్రీం కోర్టుకు న్యాయవాదులు విన్నవించిన దరిమిళా వైద్య పరీక్షల నిర్వహణను ఆర్మీ ఆసుపత్రిలో టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో నిర్వహించాలని, తెలంగాణ హైకోర్టు న్యాయాధికారి సమక్షంలో మొత్తం వీడియో గ్రఫీ తీసి నివేదిక పంపాలని ఆదేశించిన జరిగింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు చేసి పంపిన నివేదకను సుప్రీం కోర్టు పరిశీలించింది. పాదానికి గాయాలు ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఎడమ కాలి బొటన వేలి సమీపంలో చిన్న ఫ్రాక్చర్ కూడా అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ నివేదిక పరిశీంచిన సుప్రీం కోర్టు ఇరువర్గాల వాదనలు విని చివరకు షరతులతో రఘురామకు బెయిల్ మంజూరు చేసింది. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఎడమ కాలికి గాయం అయ్యిందని ఆర్మీ వైద్యులు స్పష్టంగా పేర్కొన్నారు.
అయితే గుంటూరు నుండి కారులో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి వెళ్లే సమయంలో రఘురామ కృష్ణం రాజు కారులో నుండి మీడియా కెమెరాలు కనబడిన సందర్భంలో తన కుడి కాలు పైకి ఎత్తి చూపించారు. కారు ఎడమ సీటులో కూర్చున్న రఘురామ ఎడమ కాలు పైకి ఎచ్చి చూపించడం కష్టం కావడంతో తన అనుకూల మీడియాలో హైప్ క్రియేట్ చేయడం ఏదో ఒక కాలు చూపించాలన్నట్లు కుడి కాలు చూపించారా? లేక ఏ కాలుకు దెబ్బ తగిలిందో తెలియక కంగారులో అలా చేశారా ? అని చర్చించు కుంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఆర్మీ వైద్యుల రిపోర్టుతో రఘురామ చేసిన ఆరోపణలో కొంత నిజం ఉందని తేలిపోయింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?