AP Cinema Online Ticket Issue: ఏపిలో ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఏపి ఫిల్మ్ డవలప్మెంట్ కార్పోరేషన్ ద్వారా టికెట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి గానూ ఈ నెల 2వ తేదీన ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆన్ లైన్ ద్వారా టికెట్ల అమ్మకాలకు సంబంధించి నెల రోజుల్లో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశించింది. అయితే ఎంఓయూ పత్రాలు చూసిన థియేటర్ యాజమాన్యం షాక్ గురైంది. టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించడం వరకూ బాగానే ఉన్నా, టికెట్లు విక్రయించిన తర్వాత ధియేటర్ లకు డబ్బు ఎప్పుడు జమ చేస్తారు అనే అంశాన్ని ఎంఓయులో పేర్కొనకపోవడంతో వారు ఆందోళనకు గురి అవుతున్నారు. ఎంఓయుపై థియేటర్ల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఫిలిమ్ ఛాంబర్ ద్వారానే ఆన్ లైన్ లో టికెట్ల విక్రయాలను జరుపుతామని ఎగ్జిబిటర్లు పేర్కొంటున్నారు. ఎంఓయులపై సంతకం పెడితే తమ జుట్టు ప్రభుత్వం చేతిల్లో పెట్టినట్లేనని వారు ఆందోళన చెందుతున్నారు. జూలై 2వ తేదీలోగా ఎంఓయూలపై సంతకాలు చేయకపోతే థియేటర్ల లైసెన్సులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే థియేటర్ల యాజమాన్యం ఈ హెచ్చరికలను ఖాతరు చేయడం లేదు. అవసరమైతే థియేటర్లను మూసివేసేందుకు కూడా సిద్ధమేననీ, ఎంఓయులో డబ్బులు తిరిగి థియేటర్లకు ఎప్పుడు చెల్లిస్తామనే అంశాన్ని ఎంఓయులో పెట్టకపోతే సంతకాలు చేయబోమని థియేటర్ల యాజమానులు అంటున్నారు. దీనిపై స్పందించిన ఫిలిం ఛాంబర్.. ఎగ్జిబిటర్ల ఆందోళనను, అభ్యంతరాలను తెలియజేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాసినట్లు తెలుస్తొంది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి.