AP Cinema Tickets: ఏపిలో సినిమా టికెట్ల వివాదానికి తెరపడింది. టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సినీ వర్గాలకు బిగ్ రిలీఫ్ వచ్చినట్లు అయ్యింది. గత కొంత కాలంగా సినిమా టికెట్ల అంశంపై ఏపి సర్కార్ వర్సెస్, సినీ పరిశ్రమ అన్నట్లుగా తీవ్ర స్థాయిలో వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఏపి ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను గరిష్టంగా రూ.250లు, కనిష్టంగా రూ.20లు నిర్ధారించింది. ప్రభుత్వం అనుమతించిన టికెట్ల రేట్లపై జీఎస్టీ అదనంగా ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది.
AP Cinema Tickets: వంద కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు
భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి పది రోజుల పాటు టికెట్లు రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం అందుకు ఓ కండీషన్ పెట్టింది. హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా వంద కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలకు టికెట్ రేట్లను పది రోజుల పాటు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. అయితే కనీసం 20 శాతం షూటింగ్ ఏపిలో చేసిన చిత్రాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుందని పేర్కొంది. చిన్న సినిమాలకు అయిదు షోలు వేసుకునే అవకాశం ఇచ్చింది.
AP Cinema Tickets: పెరిగిన సినిమా టికెట్ల ధరలు ఇలా..
నగర పంచాయతీల్లో నాన్ ఏసీ -కనిష్ట ధర రూ.20లు, ఎసీ థియేటర్ల కనిష్ట ధర రూ.50లు.
నగర పంచాయతీ స్పెషల్ థియేటర్లు కనిష్ట ధర రూ.70లు, నగర పంచాయతీల్లో మల్టీప్లెక్స్ ల్లో ధర రూ.100 ల నుండి రూ.250లు,
మున్సిపాలిటీల్లో నాన్ ఏసీ కనిష్ట ధర రూ.30లు,, ఏసీ థియేటర్లు – కనిష్ట ధర రూ.60లు
మున్సిపాలిటీల్లో స్పెషల్ థియేటర్లు కనిష్ట ధర రూ.80లు, మల్టీ ప్లెక్స్ ల్లో టికెట్ ధర రూ.125, రూ.250లు
మున్సిపల్ కార్పోరేషన్లలో నాన్ ఏసీ కనిష్ఠ ధర రూ.40లు, ఏసి థియేటర్లలో కనిష్ఠ ధర రూ.70లు
మున్సిపల్ కార్పోరేషన్లలో స్పెషల్ థియేటర్లు కనిష్టం రూ.100లు, మల్టీ ప్లెక్స్ లలో టికెట్ ధర రూ.150. రూ.250లు
అయితే త్వరలో విడుదల కానున్న పలు భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం విధించిన షరతుల కారణంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం విధించిన నిబంధన వల్ల ఇకపై భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ లో 20 శాతం ఏపిలో జరిగే అవకాశం కలుగుతుందేమో చూడాలి మరి.
సినీ పరిశ్రమ సమస్యలపై గత నెల మొదటి వారంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ప్రముఖ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, ఆలీ, పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణ మూర్తి తదితర సినీ పెద్దలు సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.