AP CM Jagan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ విషయంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల క్రితమే సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించారు. సమీర్ శర్మ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ జగన్ సర్కార్ ఈ నెల మొదటి వారంలో కేంద్రానికి లేఖ రాసింది. ఏపి ప్రభుత్వ లేఖపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఏపి ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు నేడు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కుల్దీప్ చౌదరి ఏపి ప్రభుత్వానికి ప్రత్యుత్తరం పంపించారు. సమీర్ శర్మ పదవీ కాలాన్ని డిసెంబర్ 1వ తేదీ నుండి 31 మే 2022 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్రం తన లేఖలో పేర్కొంది.
AP CM Jagan: ఈ ఇద్దరి బాటలోనే..
ఇంతకు ముందు సీఎస్ లు గా పని చేసిన నీలం సాహ్ని, ఆదిత్యనాథ్ దాస్ ల పదవీ కాలాన్ని జగన్ సర్కార్ పొడిగించిన విషయం తెలిసిందే. నీలం సాహ్ని పదవీ విరమణ అయిన తరువాత ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ అయిన వెంటనే ఆయన స్థానంలో నీలం సాహ్నిని జగన్ సర్కార్ నియమించింది. నీలం సాహ్ని తరువాత సీఎస్ గా పదవీ విరమణ అయిన ఆదిత్యనాధ్ ను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గానూ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఈ ఇద్దరి బాటలోనే నేడు సమీర్ శర్మ పదవీ కాలాన్ని జగన్ సర్కార్ పొడిగించింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?