ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ పండుగను భక్తి శ్రద్దలతో నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు ఈద్ ముబారక్ (శుభాకాంక్షలు) తెలియజేశారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని జగన్ పేర్కొన్నారు. మనవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ. సామరస్యానికి, సుహృద్భావానికి , సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని సీఎం జగన్ అన్నారు.
కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దాన ధర్మాలతో ధాతృత్వం, సామూహిక ప్రార్ధనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన పేర్కొన్నారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్ధనలు సఫలం కావాలనీ, అల్లాహ్ దీవెనలతో ఏపి ప్రజలకు అంతా మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ముస్లిం సోదరసోదరీమణులకు ఈద్ ముబారక్ తెలియజేస్తూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
“సామరస్యానికి, సుహృద్భావానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండుగ. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ఇది. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
YSRCP: ఏపిలో టీడీపీకి బిగ్ షాక్.. మళ్లీ వైసీపీదే హవా అని పేర్కొన్న టైమ్స్ నౌ సర్వే