TTD Board Members: ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలి సభ్యుల ఎంపిక పూర్తి అయ్యింది. వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖుల తమ వారికి బోర్డులో అవకాశం కల్పించాలంటూ ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి సిఫార్సులు చేశారు. సిఫార్సుల ద్వారా వచ్చిన పేర్లు చూస్తే దాదాపు వందకు పైగా రాగా అందులో స్క్రూటినీ చేసి 25 మంది రెగ్యులర్ పాలకమండలి సభ్యులుగా, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. నేడు కూడా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయి బోర్డు సభ్యుల కూర్పుపై చర్చించినట్లు సమాచారం. కాగా 25 మందితో జాబితా ఫైనల్ కాగా తెలంగాణ నుండి పాలకమండలిలో మైహోం రామేశ్వరరావు రెండోసారి సభ్యత్వం దక్కించుకున్నారు.
TTD Board Members: నూతన పాలకమండలి సభ్యులు
పాలకాల ఆశోక్, మల్లాడి కృష్ణావు, జూపల్లి రామేశ్వరరావు (మైహోం), మారుతి, జీవన్ రెడ్డి, పార్థసారధి రెడ్డి, జే శ్రీనివాసన్, రాజేశ్ శర్మ, సౌరభ్, కన్నయ్య, మూరంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్, నంద కుమార్, సంతోష్ ఆడిటర్, వేమిరెడ్డి పార్థసారధి రెడ్డి, డాక్టర్ కేతన్ దేశాయ్, లక్ష్మీనారాయణ, మిలిద్, శశిధర్, శ్రీమతి కృష్ణంరాజు రాజోలు, శంకర్, విశ్వనాథ్ రెడ్డి, మధుసూధన్ యాదవ్, గోళ్ల బాబూరావు, కాటసాని రాంభూపాల్ రెడ్డి లు పాలకమండలి సభ్యులుగా నియమితులు అయ్యారని తెలుస్తోంది. అయితే అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.