ఏపి Andhra Pradesh ముఖ్యమంత్రి CM వైఎస్ జగన్మోహనరెడ్డి YS jagan Mohan reddy శుక్రవారం విజయవాడ Vijayawada ప్రకాశం బ్యారేజీకి సమీపంలో తొమ్మిది ఆలయాల పునః నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. టీడీపీ TDP ప్రభుత్వ హయాంలో కృష్ణా పుష్కారాల సమయంలో కృష్ణానదీ తీరంలో ఉన్న తొమ్మిది ఆలయాలను తొలగించారు. ప్రస్తుత వాటిని తిరిగి అదే స్థానంలో నిర్మించేందుకు వైసీపీ YCP ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
శుక్రవారం రూ.77 కోట్లతో దుర్గగుడి అభివృద్ధి పనులతో పాటు తొమ్మిది ఆలయాల పునః నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు, ఘనాపాటీలు సీఎం జగన్ కు ఆశీర్వచనాలు అందజేశారు. తదుపరి దేవదాయ శాఖ వివిధ ఆలయాలపై రూపొందించిన క్యాలెండర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ పేర్ని నాని, కొడాలి నాని, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారధి, మేకా ప్రతాప్ అప్పారావు, జోగి రమేష్, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, కమిషనర్ అర్జునరావు, కలెక్టర్ ఇంతియాజ్, సీపీ శ్రీనివాసులు, జేసి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.