ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు చేరుకున్నారు. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ అక్కడ నుండి హెలికాఫ్టర్ లో ఇడుపులపాయకు వెళ్లారు. జగన్ వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు.
డిప్యూటి సీఎం అంజాద్ బాష, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపి అవినాష్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, ఎమ్మెల్యలు, జిల్లా కలెక్టర్ హరికిరణ్, కర్నూలు రేంజ్ డీఐజీ వెంకట్రామిరెడ్డి తదితరులు జగన్ కు ఘన స్వాగతం పలికారు. నేటి రాత్రి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ అతిధి గృహంలో సీఎం జగన్ బస చేయనున్నారు.
రేపు 24వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్కు చేరుకుని ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారు. ఆ తరువాత చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మద్యాహ్నం 1.30 గంటలకు గెస్ట్ హౌస్ నుండి పులివెందుల భాకరాపురం చేరుకుంటారు.సాయంత్రం 4.40 వరకూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 5.20గంటలకు ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. 25వ తేదీ ఉదయం హెలికాఫ్టర్ లో పులివెందులకు చేరుకుని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సమేతంగా పాల్గొంటారు. 11.20గంటలకు పులివెందుల భాకపురం హెలిప్యాడ్ నుండి బయలుదేరి 11.45 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.55 గంటలకు కడప నుండి ప్రత్యేక విమానంలో రాజమండ్రి బయలుదేరి వెళతారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?