చైనా సహా పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్ 7 కేసులు ఉదృతమవుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్ష సందర్భంగా కోవిడ్ అప్రమత్తతపై అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. దేశంలో కరోనా కేసుుల మళ్లీ పెరుగుతున్నందున రాష్ట్రంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
కోవిడ్ టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ సూచించారు. సరిపడా ఆక్సిజన్ బెడ్లను కూడా సిద్దంగా ఉంచాలని చెప్పారు. ఏపిలో ఇంత వరకూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 నమోదు కాలేదని అధికారులు వివరించారు. కోవిడ్ చికిత్స, నివారణ చర్యల్లో విలేజ్ క్లినిక్ లే కేంద్రంగా చికిత్స అందించాలని అందుకు తగిన విధంగా ఎస్ఓపీలు ఉండాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. పిహెచ్ సీల పర్యవేక్షణలో విలేజ్ క్లినిక్ లు పని చేయాలన్నారు. మాస్కులు ధరించడంతో పాటు కోవిడ్ నివారణ చర్యలపై అవగాహన కల్పించాని చెప్పారు.
అనుమానాస్పదంగా ఉన్న కేసుల్లో తప్పనిసరిగా పరీీక్ష లు చేయాలని ఆదేశించారు. అదే విధంగా ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలపై మరో సారి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలనీ, కోవిడ్ పరంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల సన్నద్దతను ముందుగా తనిఖీ చేయాలన్నారు. 2023 జనవరి 4వ తేదీలోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోని సౌకర్యాలపైనా తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు కోవిడ్ ను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను వివరించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. తెలంగాణ సర్కార్ కు బిగ్ షాక్..కానీ..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?