రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఆరోపణలపై కొందరు మంత్రులు స్పందించడం లేదు. ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేయడం లేదు. రీసెంట్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై టీడీపీ నేతలు ఆరోపణలు చేసిన సందర్భంలో వైసీపీ నుండి కొద్ది మంది మాత్రమే సీరియస్ రియాక్ట్ అయి ఆరోపణలను ఖండించారు. ఈ అంశంతో పాటు ప్రభుత్వంపై టీడీపీ అనుకూల మీడియాలో వ్యతిరేక వార్తలు వస్తున్నా మంత్రులు కొందరు మంత్రులు తిప్పికొట్టడం లేదు. దీంతో సీఎం జగన్ సీరియస్ అయ్యారని వార్తలు వినబడుతున్నాయి. బుధవారం కేబినెట్ సమావేశం పూర్తి అయిన తర్వాత ప్రభుత్వంపై విపక్షం నుండి ఆరోపణలు వస్తున్నా ఎవరూ స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండు నెలలు సమయం ఇస్తున్నా ఈ లోపు పని తీరు మార్చుకోవాలని లేకుంటే మంత్రివర్గ నుండి తప్పిస్తానని కూడా హెచ్చరించినట్లు తెలిసింది.
ఆరోపణలపై తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు మంత్రుల తీరు పట్ల సీఎం జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇకపై దూకుడుగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం చేసే మంచిని కూడా చెడుగా చిత్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్న మీడియాకు, ప్రతిపక్షాలకు ఇక నుండి స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వల్సిందేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. అదే పనిగా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని తెలిపారు. మంత్రులు అందరూ ప్రతి అంశంపైనా స్పందించాలని సూచించారు. టీడీపీ అనుకూల మీడియా, ఛానల్ లలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడంతో పాటు కుటుంబ సభ్యులపైనా అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడిన సీఎం జగన్.. ఇకపై వీటిని సమర్ధవంతంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు.
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ ..ఆమోదించిన కీలక అంశాలు ఇవి