Nandamuri Balakrishna: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లానాయక్ విడుదల సందర్భంగా ఏపిలో మరో సారి సినిమా థియేటర్ల అంశం, టికెట్ల వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. పవన్ కళ్యాణ్ సినిమా పై ప్రభుత్వం కక్షకట్టిందని, అందుకే థియేటర్ల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారంటూ విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు సైతం దీనిపై కామెంట్స్ చేశారు. నిబంధనల ప్రకారం టికెట్లు అమ్మాలంటే నేరం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ పెద్దలు. టీడీపీ, జనసేన కామెంట్స్ బ్లాక్ టికెట్ల విక్రయాలను ప్రోత్సహించమన్నట్లుగా ఉంటున్నాయని అంటున్నారు. ఈ తరుణంలో నందమూరి బాలకృష్ణపై ఏపి మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ వర్గాల్లో అటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Nandamuri Balakrishna: అఖండ నిర్మాతలు కలిశారు
సినిమా టికెట్ల అంశంలో అగ్రహీరోలు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు తదితరులు ఇటీవల సీఎం జగన్ కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తాను సినిమా టికెట్ల అంశంపై సీఎం జగన్ ను కలవననీ, అవసరమైతే తన నియోజకవర్గం హిందూపురం సమస్యలపై మాత్రమే కలుస్తానని నందమూరి బాలకృష్ణ అన్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ తరుణంలో తాజా మంత్రి పేర్ని నాని అఖండ మువీకి ముందు వారి మధ్య జరిగిన సంభాషణ వెల్లడించడం చర్చనీయాంశం అయ్యింది. బాలకృష్ణ అబద్దం ఆడతారని తాను ఆనుకోవడం లేదని మంత్రి నాని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న బిల్డర్ నారాయణ ప్రసాద్, నూజివీడు ఎమ్మెల్యే ద్వారా అఖండ నిర్మాతలు సినిమా విడుదలకు ముందు తనను కలవడానికి విజయవాడ వచ్చారన్నారు.
సీఎం జగన్ ను బాలకృష్ణ కలుస్తానన్నారు
అదే సమయంలో వారు హీరో బాలకృష్ణతోనూ ఫోన్ లో మాట్లాడించారని ఆ సమయంలో సీఎం జగన్ ను కలుస్తానని బాలకృష్ణ చెప్పారన్నారు. ఈ విషయాన్ని తాను సీఎం జగన్ కు చెప్పగా, బాలకృష్ణ తనను కలిస్తే అది వేరే విధమైన ప్రచారానికి కారణమవుతుందని జగన్ అన్నారని వివరించారు. అయితే అఖండ సినిమాకు సంబంధించి బాలకృష్ణ నిర్మాతలకు పూర్తి సహకారం అందించమని జగన్ తనకు చెప్పారన్నారు మంత్రి నాని. అప్పుడు సీఎం జగన్ ను కలుస్తానని చెప్పిన బాలకృష్ణ ఆ తరువాత తాను జగన్ ను కలవనని చెబుతారని అనుకోలేదన్నారు. బాలకృష్ణ అబద్దం చెబుతారని కూడా తాను భావించడం లేదని నాని అన్నారు. రాజకీయంగా విరోధులైన బాలకృష్ణ నిర్మాతలకు పూర్తి సహకారం అందించాలని సీఎం జగన్ మంత్రి పేర్ని నానికి చెప్పారు అంటే బాలకృష్ణకు జగన్ ఫుల్ సపోర్టు ఇచ్చినట్లే కదా..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?