NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Delhi Tour: ఒకే వేదిక పంచుకోనున్న ఏపి సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు..ఏపి రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Delhi Tour: ఏపిలో రాజకీయ పరిస్థితులు గత రాజకీయాలకు భిన్నంగా ఉన్నాయి. గతంలో ప్రధాన పార్టీల నేతల మధ్య రాజకీయ వైరమే ఉండేది గానీ వ్యక్తిగత వైరం ఉండేది కాదు. వివిధ కీలక అంశాలపై అఖిల పక్ష భేటీలు జరిగేవి. అసెంబ్లీలో అధికార, విపక్ష నేతల మధ్య పలు అంశాలపై వాడివేడిగా చర్చ జరిగి ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నప్పటికీ బయటకు వచ్చిన తర్వతా సరదాగా నేతలు మాట్లాడుకునే సందర్భాలు ఉండేవి. కానీ వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయ వైరం ఎన్నికల వరకే పరిమితం కాకుండా ఆ పార్టీ నేతల మధ్య వ్యక్తిగత వైరంగా మారింది. అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు జరిగిన నేపథ్యంలో నేతలు పరస్పరం మాట్లాడుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ తరుణంలో ఏపి అధికార పక్ష నేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఢిల్లీలో ఇవేళ ఒకే వేదిక పంచుకోనుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే సమావేశానికి ఇద్దరు హజరుకానున్నారు.

AP CM Jagan Chandrabau

 

ప్రపంచంలో ఆర్ధికంగా బలంగా ఉన్న గ్రూప్ ఆఫ్ ట్వంటీ (టీ 20) దేశాలకు 2022 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2023 నవంబర్ 30 వరకూ భారత్ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200లకు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తా ను ప్రపంచానికి తెలియజేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసేందుకు కేంద్రం అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తున్నది. ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన ఈ రోజు (డిసెంబర్ 5) సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ నందు జరిగే అభిలపక్ష సమావేశానికి హజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.

PM Modi

 

ఈ క్రమంలోనే ఏపి సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆహ్వానాలు అందడంతో వీరు సమావేశంలో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్దమైయ్యారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుుక టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే హైదరాబాద్ లోని తన నివాసం నుండి బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడకు చేరుకుంటారు. సాయంత్రం 4.45 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుని.. రాత్రి 7 గంటల వరకు అక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుండి బయలుదేరి మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుండి రాష్ట్రపతి భవనంలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అయితే ఏపి ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత ఒకే వేదిక పంచుకోనుండటంతో ఆసక్తి నెలకొంది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N