NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో ఆలయాల పునః నిర్మాణానికి నేడు సీఎం జగన్ శంకుస్థాపన

 

ఏపిలో రామతీర్ధంతో సహా పలు ప్రాంతాల్లో దేవాలయాలపై జరిగిన దాడులను పురస్కరించుకుని బీజేపీ, హింధూ సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చివేసిన పలు ఆలయాల పునరుద్దరణకు చర్యలు చేపట్టింది జగన్ సర్కార్. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉందనీ, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసి లబ్దిపొందాలన్న దురుద్దేశాలు ఉన్నాయనీ ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. జరిగిన ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ రామతీర్థం సహా పలు ఘటనల దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. ఇదిలా ఉండగా విజయవాడలో ఆలయాల పునః నిర్మాణం, దుర్గ గుడిలో అభివృద్ధి, విస్తరణ పనులకు ప్రభుత్వం 77 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు (శుక్రవారం 11.01 గంటలకు) ఆలయాల పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణ ముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహుకేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్ణుడి ఆలయం, కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునః నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు.

పునః నిర్మాణం చేపట్టే ఆలయాలు

రూ.70 లక్షలతో రాహుకేతు ఆలయ పునః నిర్మాణం, రూ.9.5 లక్షలతో సీతమ్మ పాదాలు ఆలయ పునః నిర్మాణం, రూ.31.5 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయం, రూ.2 కోట్లతో రాతితో శ్రీ శనీశ్వర ఆలయ పునః నిర్మాణం, రూ.8 లక్షలతో బొడ్డుబొమ్మ ఆలయ పునః నిర్మాణం, రూ.20 లక్షలతో దుర్గుగుడి మెట్ల వద్ద శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునః నిర్మాణం, రూ.10 లక్షలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీదాసాంజనేయ ఆలయ పునః నిర్మాణం, రూ.10 లక్షలతో పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో వీరబాబు ఆలయ పునః నిర్మాణం, రూ.20 లక్షలతో కనకదుర్గ నగర్ లో శ్రీవేణుగోపాల కృష్ణ మందిరం, గోశాల పునః నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

అదే విధంగా దుర్గగుడిలో రూ.8.5కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం, రూ.5.6 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం, రూ.2 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకారం విస్తరణ, రూ.23.6 కోట్లతో కేశఖండన శాఖ భవన నిర్మాణం, రూ.19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణం, రూ.5.25 కోట్లతో కనకదుర్గ టోల్ ప్లాజా నిర్మాణం, రూ.6.5 కోట్లతో ఘాట్ రోడ్డులో మరమ్మత్తులు, కొండ చరియలు విరిగి పడకుండా మరమ్మత్తులు, పటిష్ట చర్యలు, రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ పనులు చేయనున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk