ఏపిలో రామతీర్ధంతో సహా పలు ప్రాంతాల్లో దేవాలయాలపై జరిగిన దాడులను పురస్కరించుకుని బీజేపీ, హింధూ సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చివేసిన పలు ఆలయాల పునరుద్దరణకు చర్యలు చేపట్టింది జగన్ సర్కార్. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉందనీ, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసి లబ్దిపొందాలన్న దురుద్దేశాలు ఉన్నాయనీ ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. జరిగిన ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ రామతీర్థం సహా పలు ఘటనల దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. ఇదిలా ఉండగా విజయవాడలో ఆలయాల పునః నిర్మాణం, దుర్గ గుడిలో అభివృద్ధి, విస్తరణ పనులకు ప్రభుత్వం 77 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు (శుక్రవారం 11.01 గంటలకు) ఆలయాల పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణ ముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహుకేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్ణుడి ఆలయం, కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునః నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు.
రూ.70 లక్షలతో రాహుకేతు ఆలయ పునః నిర్మాణం, రూ.9.5 లక్షలతో సీతమ్మ పాదాలు ఆలయ పునః నిర్మాణం, రూ.31.5 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయం, రూ.2 కోట్లతో రాతితో శ్రీ శనీశ్వర ఆలయ పునః నిర్మాణం, రూ.8 లక్షలతో బొడ్డుబొమ్మ ఆలయ పునః నిర్మాణం, రూ.20 లక్షలతో దుర్గుగుడి మెట్ల వద్ద శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునః నిర్మాణం, రూ.10 లక్షలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీదాసాంజనేయ ఆలయ పునః నిర్మాణం, రూ.10 లక్షలతో పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో వీరబాబు ఆలయ పునః నిర్మాణం, రూ.20 లక్షలతో కనకదుర్గ నగర్ లో శ్రీవేణుగోపాల కృష్ణ మందిరం, గోశాల పునః నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
అదే విధంగా దుర్గగుడిలో రూ.8.5కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం, రూ.5.6 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం, రూ.2 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకారం విస్తరణ, రూ.23.6 కోట్లతో కేశఖండన శాఖ భవన నిర్మాణం, రూ.19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణం, రూ.5.25 కోట్లతో కనకదుర్గ టోల్ ప్లాజా నిర్మాణం, రూ.6.5 కోట్లతో ఘాట్ రోడ్డులో మరమ్మత్తులు, కొండ చరియలు విరిగి పడకుండా మరమ్మత్తులు, పటిష్ట చర్యలు, రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ పనులు చేయనున్నారు.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…