YS Jagan: పీఎస్ఎల్వీ సీ – 52 రాకెట్ ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ విజయంతో అభివృద్ధి చెందిన దేశలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకువెళ్లిందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు విజయవంతం కావాలాలని ఆకాక్షించారు సీఎం జగన్.
YS Jagan: ఇస్రోలో సంబరాలు
పీఎస్ఎల్వీ – 52 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈఓఎస్-04 ఐఎన్ఎస్ – 2టీడీ, ఇన్ స్పేర్ శాట్ -1 తో పాటు మరో రెండు చిన్న ఉప గ్రహాలను సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ 52 కక్షలోకి తీసుకువెళ్లింది. ఈ రోజు ఉదయం 5.59 గంటలకు ఏపిలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్ థావన్ స్పేస్ సెంటర్ లోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుండి ఈ ప్రయోగం జరిగింది. ఇస్రోకు 2022లో ఇదే మొదటి ప్రయోగం. అంతే కాకుండా ఇస్రో చైర్మన్ గా ఇటీవల నియమితులైన డాక్టర్ సోమనాథ్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి రాకెట్ ప్రయోగం ఇది. పీఎస్ఎల్వీ సీ – 52 విజయంతో ఇస్రోలో సంబరాలు చేసుకున్నారు. శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి.