YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన వద్ద పని చేసే ఉద్యోగులు, సన్నిహితుల విషయంలో చాలా అప్యాయంగా ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. వారి కుటుంబాలతోనూ మమేకం అవ్వడం, వారి ఇళ్లలో కార్యక్రమాలకు హజరు అవుతూ ఉంటారు. వారి కుటుంబాల్లో వివాహ వేడుకలకు తీరిక చేసుకుని మరీ వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుంటారు. వివాహ వేడుకకు హజరు కాని పరిస్థితుల్లో రిసెప్,న్ కు అయినా వెళుతూ ఉంటారు. రీసెంట్ గా ప్రముఖ సినీ నటుడు ఆలీ కుమార్తె వివాహం హైదరాబాద్ లో జరగ్గా ఆ వేడుకకు హజరుకాలేకపోయారు. ఆ తర్వాత గుంటూరులో రిసెప్షన్ వేడుకకు హజరై నవ వధు వరులను ఆశీర్వదించారు సీఎం జగన్. తాజాగా తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో ఉన్న సీఎం జగన్ తన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రవిశేఖర్ యాదవ్ కుమార్తె హేమలత వివాహానికి హజరైయ్యారు.
సీబీఐ నోటీసుల నేపథ్యంలో తండ్రి కేసిఆర్ ను కలిసిన తనయ కవిత
ఇవేళ ఇడుపులపాయ నుండి హెలికాఫ్టర్ లో సతీసమేతంగా బయలుదేరిన సీఎం జగన్ పులివెందులలోని భాకరాపురం చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో కదిరి రోడ్డులో ఉన్న ఎస్సీఎస్సార్ గార్డెన్ లో జరుగుతున్న రవి శేఖర్ యాదవ్ కుమార్తె వివాహ వేడుకకు హజరైయ్యారు. వధువరులు హేమలత, గంగాధర్ లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత పెళ్లి మండపానికి విచ్చేసిన సీఎం జగన్, భారతి దంపతులకు రవిశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. వివాహ వేడుకకు సీఎం జగన్ దంపతులు రాకతో కోలాహలం నెలకొంది. ఈ వివాహ వేడుకలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ పాల్గొన్నారు.
HCU: ఆచార్య వృత్తికే కళంకం .. విద్యార్దినిపై అత్యాచారయత్నం