ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ నెల్లూరు జిల్లా సూళ్లురుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి హజరైయ్యారు. విజయవాడ లో జయహో బీసీ మహాసభ లో పాల్గొని ప్రసంగించిన అనంతరం గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. అక్కడ నుండి నెల్లూరుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. నెల్లూరు నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుని నవదంపతులు శ్రావణ్, సౌజన్యలను ఆశీర్వదించి అభినందనలు తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్ వెంట ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులు హజరైయ్యారు. వివాహ మహోత్సవ వేడుకకు సీఎం జగన్ హజరుకావడంతో ఎమ్మెల్యే సంజీవయ్య కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
నిన్న కడపలో తన సమీప బంధువు, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించాల్సి ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కడప పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. కడప ఎయిర్ పోర్టు వద్ద నిన్న ఉదయం పొగమంచు అధికంగా ఉండటంతో ఎయిర్ ట్రాఫిక్ క్లీయరెన్స్ రాలేదు. దీంతో సీఎం జగన్ ఆ వివాహ రిసెప్షన్ వేడుకకు హజరు కాలేకపోయారు.
వైసీపీ జయహో బీసీ మహాసభ గ్రాండ్ సక్సెస్ .. నేతలు ఎవరు ఏమన్నారంటే..?