CM YS Jagan: విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రం సస్యశ్యామలంగా అబివృద్ధి చెందుతూ ప్రజలందరూ కల్యాణ సౌభగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఉదయం 5 గంటలకు మహా మంగళ వాయిద్యా హృద్యనాదం, భగవత్ ప్రీతిగా వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్ర – విష్యక్సేన పూజలు, పుణ్యాహవచనం, దీక్ష ధారణ, అజస్ర దీపారాధన తదితర కార్యక్రమాలు మొదలయ్యాయి. సీఎం వైఎస్ జగన్ యాగశాలకు విచ్చేసి యజ్ఞ సంకల్పం తీసుకున్న అనంతరం మహాయజ్ఞం ప్రారంభమైంది. గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్ .. కపిల గోవులకు హారతి ఇచ్చారు. అనంతరం అఖండ దీపారాధనలో పాల్గొన్నారు.
ఆరు రోజుల పాటు
మే 17 వ తేదీ బుధవారం వరకూ ఆరు రోజుల పాటు ఈ మహాయజ్ఞం కొనసాగనుంది. వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు జరుగుతాయి. ఒక్కొక్క యాగశాలలో 27 కుండాల చొప్పున మొత్తం 108 కుండాలతో రుత్మికులు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకూ, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకూ కొనసాగుతాయి. పవిత్ర సప్తనదీ, త్రి సముద్ర జలాలతో 1008 కలశాలతో విశేష అభిషేకాలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.
యజ్ఞంలో తొలి రోజున శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం, 13న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణం, 14న అన్నవరం శ్రీ వెంకటేశ్వరస్వామి, 15న శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, 16న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. 17వ తేదీ చివరి రోజు సీఎం జగన్ చేతుల మీదుగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, పీఠం ఉత్తారాధికారి స్వాత్మానందేంద్ర అన్వయంతో మహా పూర్ణాహుతితో యజ్ఞ కార్యక్రమాలు ముగుస్తాయి.
Pawan Kalyan: సీఎం పదవి, పొత్తులపై పవన్ క్లారిటీ ఇచ్చేశారు(గా)..!