AP CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి YS Jagan mohan reddy సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. డిప్యూటి సీఎంలు నారాయణస్వామి, కృష్ణదాస్ పరిధిలోని రెండు కీలక విభాగాలు ఆర్థిక మంత్రి బుగ్గన పరిధిలోకి మార్పు చేశారు. ఇద్దరు డిప్యూటి సీఎంలు కే నారాయణ స్వామి, ధర్మాన కృష్ణ దాస్ పరిదిలో ఉన్న వాణిజ్య పన్నులు, స్టాంపులు – రిజిస్ట్రేషన్ల విభాగాలను బుగ్గన రాజేంద్రనాథ్ నిర్వహిస్తున్న ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి వాణిజ్య పన్నుల విభాగంతో పాటు రిజిస్ట్రేషన్లు – స్టాంపుల విభాగం రెవెన్యూ శాఖ నుండి ఆర్థిక శాఖకు మార్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
డిప్యూటి సీఎం నారాయణ స్వామి పరిధిలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ, మరో డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాసు పరిధిలో రెవెన్యూ (ల్యాండ్స్) శాఖలు ఉంటాయి. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ డైరెక్టర్, ఐజి కార్యాలయాలు, ఏపి వ్యాట్ ట్రైబ్యునల్ లాంటి సంస్థలన్నీ ఆర్థిక శాఖ నియంత్రణలో పని చేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక పనుల నిర్వహణను సులభతరం చేసేందుకు ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ అంశాలను ఆర్థిక శాఖలోని కార్యదర్శి గుల్జార్ పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది.
Read More: YS Viveka Case; మూలాలు కదులుతున్నయ్..! వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు..!!