ఎస్ఎస్ఎల్వీ డీ 2 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మూడు ఉప గ్రహాలను ఒకే సారి కక్షలోకి ప్రవేశపెట్టి ఇస్రో మరో విజయం నమోదు చేసుకోవడంపై శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
శ్రీహరికోట నుండి ఇవేళ ఎస్ఎస్ఎల్వీ డి 2 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రయోగంలో ఎస్ఎస్ఎల్వీ డి 2.. మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకువెళ్లింది. కాగా, 13 నిమిషాల రెండు సెకన్లలో రాకెట్ ప్రయోగం పూర్తి అయ్యింది. దీని ద్వారా రెండు దేశీయ, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాయి.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు .. సీఎం చొరవతో మైలవరంలో వివాదానికి తెర పడినట్లే(గా)..!