AP CM YS Jagan Delhi Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ ముగిసింది. ప్రధానితో గంటకు పైగా సీఎం భేటీ కొనసాగింది. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అశంలాలు, రెవెన్యూ లోటు, తెలంగాణ నుండి రావాల్సిన నిధులపై చర్చించడంతో పాటు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ ప్రధానికి వివరించినట్లు సమాచారం. ప్రధాన అంశాలపై మోడీకి సీఎం జగన్ వినతి పత్రం అందించినట్లు తెలుస్తోంది.
AP CM YS Jagan Delhi Tour: రాత్రి 9.30 గంటలకు హోంశాఖ మంత్రి అమిత్ షాతో
కాగా సీఎం జగన్ కొద్ది సేపటిలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నారు. రాత్రి 9.30 గంటలకు హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. విభజన హామీల అమలు, ఇతర సమస్యల పరిష్కారంప కేంద్ర మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు. ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం జగన్.. రేపు ఉదయం మరి కొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. మధ్యాహ్నం సీఎం జగన్ ఏపికి తిరిగి ప్రయాణం కానున్నారు.
తొలుత రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు వైసీపీ ఎంపీలు విమానాశ్రయం వద్ద స్వాగతం పలికారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మార్గాని భరత్, వంగా గీత, అయోధ్య రామిరెడ్డి, గురుమూర్తి, గోరంట్ల మాధవ్, రంగయ్య, రెడ్డప్ప, మోపిదేవి వెంకట రమణ తదితరులు సీఎం జగన్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.