AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి పయనం అవుతున్నారు. గురువారం హస్తినకు వెళతారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ప్రధాన మంత్రి అపాయిట్మెంట్ కొరకు సీఎంఓ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సీఎం వైఎస్ తన అధికార, వ్యక్తిగత విదేశీ పర్యటన ముగించుకుని నిన్ననే (మంగళవారం) తిరిగి వచ్చారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం జగన్ ఒక్క రోజు వ్యవధిలోనే ప్రధాని మోడీతో భేటీకి ఢిల్లీ వెళుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. విభజన చట్టంలోని హామీలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన బకాయిలు తదితర విషయాలపై జగన్ చర్చించారు. అయితే ఇప్పుడు మరో సారి సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో తాజా రాజకీయ పరిణామాలు, దావోస్ పర్యటన, రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP CM YS Jagan: ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో..
మరో పక్క సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై అనేక రకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంగా ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానితో చర్చించనున్నారేమో అన్న పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. ముందస్తు ఎన్నికల అంచనాలతో రాష్ట్రంలో అన్ని పార్టీలు యాక్టివ్ అయ్యాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక కార్యక్రమం పేరుతో జనాల్లోకి వెళుతున్నాయి. రాష్ట్రంలో అధికార వైసీపీని ఎదుర్కొవాలంటే బీజేపీ సహకారం కావాలని టీడీపీ భావిస్తొంది. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పరోక్షంగా టీడీపీతో పొత్తునకు సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే బీజేపీ అధిష్టానంతోనూ మాట్లాడతానని పవన్ కళ్యాణ్ అన్నట్లు వార్తలు వచ్చాయి.
నడ్డా పర్యటనకు ముందుగా..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు జనసేనతో పొత్తునకు టీడీపీ సానుకూల వైఖరిలో ఉన్న నేపథ్యంలో జనసేన – టీడీపీ కలిసి పోటీ చేసినా ఫరవాలేదు కానీ కేంద్రంలోని బీజేపీ వీరికి మద్దతు ఇవ్వకుంటే చాలు ఉన్న ధోరణిలో వైసీపీ ఉందని తెలుస్తొంది. ఎలాగూ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీకి వైసీపీ అవసరం ఉంది. అందుకే సీఎం జగన్ వ్యూహాత్మకంగా ముందస్తు ఎన్నికలకు సిద్దం అవుతున్నారని ఈ విషయంపై మోడీతో చర్చించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినబడుతున్నాయి. మరో పక్క ఈ వారంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ఏపి పర్యటనకు వస్తున్న వేళ సీఎం జగన్ ఢిల్లీకి పయనమవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?