ఆమెరికా (యూఎస్) నుండి ఇటీవల 21 మంది భారతీయ విద్యార్ధులను ఇమిగ్రేషన్ తనిఖీల అనంతరం వెనక్కు పంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. వీరిలో తెలుగు విద్యార్ధులు కూడా ఉండటంతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్పందించారు. తెలుగు విద్యార్ధులను వెనక్కి పంపిన ఘటనపై జగన్ ఆరా తీశారు. విద్యార్ధుల వివరాలు తెలుసుకుని వారి సమస్య పరిష్కరించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు సీఎం జగన్. విద్యార్ధుల పూర్తి వివరాలతో పాటు వారి సమాచారాన్ని సేకరించాలన్నారు.

ఈ అంశంపై దృష్టి సారించాలనీ, అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంఓ అధికారులకు సూచించారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య నిమిత్తం అమెరికా చేరుకున్న తాము అన్ని డాక్యుమెంట్లను సమర్పించినా ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ పత్రాలను తనిఖీ చేసి కొద్దిసేపు విచారణ జరిపి కారణం చెప్పకుండానే వెనక్కి పంపారని పేర్కొంటున్నారు విద్యార్ధులు. వారిలో ఎక్కువగా అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు.
రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈడీ సమన్లు