గురు పూజోత్సవాన్ని బహిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. సన్మానాలకు, సత్కారాలకు దూరంగా ఉండాలని సంఘ నేతలు ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. గురుపూజోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఉపాధ్యాయ సంఘ నేతల పిలుపు బుట్టదాఖలైంది. భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకలకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హజరైయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులు పురస్కారాలను అందుకున్నారు. రాష్ట్రంలోని 176 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను సీఎం జగన్ ప్రధానం చేసి సత్కరించారు.
సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధి బృందం..ఎందుకంటే..?
తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి సీఎం వైఎస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం జగన్ .. అధ్యాపకుల గొప్పతనాన్ని కొనియాడారు. విద్యార్ధులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువులదేనన్నారు. ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని అన్నారు. సాన పెట్టకపోతే వజ్రమైనా కూడా రాయితోనే సమానం అని చెప్పారు. విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉందని అన్నారు. మంచి టీచర్ల వ్యవస్థను మొత్తం మార్చగలరని అన్నారు. తనకు విద్య నేర్పిన గురువులకు రుణ పడి ఉంటానన్నారు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టి లో పెట్టుకుని విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు.
సీఎంగా విద్యాశాఖ పైనే ఎక్కువగా సమీక్షలు చేశానని చెప్పారు. పేదలకు మంచి చదువులు అందించాలన్నదే సంస్కరణ లక్ష్యమని అన్నారు. టీచర్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్ల కు పెంచామన్నారు. ఎస్ జీటీలను స్కూల్ అసిస్టెంట్లు గా ప్రమోట్ చేశామని చెప్పారు. ఉపాధ్యాయ పెన్షన్ విషయంలోనూ చిత్తశుద్దితో పని చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. టీచర్ల ను సైతం రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని విమర్శించారు సీఎం జగన్. ఎల్లో మీడియా కూడా రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తొందని ఆరోపించారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ఉన్నతాధికారులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఏపిలో ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్