AP Govt: ఏపిలో గ్రూప్ – 1, గ్రూప్ – 2 ఉద్యోగార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. త్వరలో గ్రూప్ 1, 2 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది ప్రభుత్వం. గ్రూప్ – 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ లకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. దాదాపు వెయ్యి కిపైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు తెలిపారు. నోటిపికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉంది.

గ్రూప్ 1 కి సంబంధించి సుమారు వందకు పైగా పోస్టులు, గ్రూప్ 2 కు సంబంధించి సుమారు 900లకుపైగా పోస్టు భర్తీ చేయనున్నారనేది సమాచారం. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారని అధికారులు వెల్లడించారు.
Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఇన్నోవా కారు .. ముగ్గురు మృతి