Milan 2022: విశాఖ తీరంలో జరుగుతున్న మిలాన్ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ విశాఖ వేల నౌకను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బంది నుంచి సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరించారు. విశాఖ చరిత్రలో నిలిచిపోయే విధంగా మిలాన్ వేడుకలు జరుగుతున్నాయని సీఎం జగన్ అన్నారు. వేడుకల్లో 39 దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు. జలాంతర్గామి ఐఎన్ఎస్ వేల చేరికతో సాగర రక్షణలో మరో అధ్యాయనం మొదలైందన్నారు. భారత రక్షణ వ్యవస్థలో నౌకాదళ సిబ్బంది సేవలను జగన్ కొనియాడుతూ సిబ్బందిని అభినందించారు. విన్యాసాలతో సైనిక శక్తిపై మరింత విశ్వాసం పెంపొందుతుందని సీఎం జగన్ అన్నారు.
Milan 2022: ఆకట్టుకున్న విన్యాసాలు
మిలాన్ 2022 వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ సిటీ పరేడ్ నిర్వహించగా ఆర్కే బీచ్ నుండి విన్యాసాలను సీఎం జగన్, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఎంపి ఎంవీవీ సత్యనారాయణ తదితర ప్రముఖులు వీక్షించారు. సిటీ పరేడ్ లో 13 దేశాల యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. 50 కిపైగా విమానాలు, హెలికాఫ్టర్లతో విన్యాసాలు నిర్వహిస్తున్నారు. సముద్రంపై నేవీ సిబ్బంది సాహస విన్యాసాలు, శత్రు స్థావరాలను చేజిక్కించుకునే విన్యాసాలు, సముద్రం మధ్యలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?