రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఓ వైపు రైతులు మేలు జరగడమే కాక దాదాపు 33వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లాలోని వంకాయలపాడు లో రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఐటీసీ గ్లోబల్ స్పెసెస్ యూనిట్ ను శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ .. ప్రతి ఏటా ఈ యూనిట్ లో 20 మెట్రిక్ టన్నుల మిర్చి, సుగంధ ద్రవ్యాల ప్రాసెస్ జరుగుతుందన్నారు. ఈ యూనిట్ వల్ల వేల మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ద్వారా 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. రెండవ దశ పూర్తి అయితే అతి పెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ మన దగ్గరే ఉంటుందన్నారు. 24 నెలల్లో ఈ యూనిట్ ను పూర్తి చేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఐటీసీ సంస్థకు అభినందనలు తెలియజేశారు. మున్ముందు రాష్ట్రానికి మరిన్ని స్పెసిస్ కంపెనీలు రావాలని ఆశిస్తున్నామన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లుగా దేశంలోనే ఏపి నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం పేర్కొన్నారు. రూ.3450 కోట్లతో ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నామని, ఈ యూనిట్ల ద్వారా 33వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మొదటి దశ కింద రూ.1250 కోట్లతో పది యూనిట్లకు డిసెంబర్, జనవరి నెలల్లో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు వరంగా మారనున్నాయని అన్నారు. వీటి వల్ల రైతుల పంటకు గిట్టుబాటు దక్కుతుందని తెలిపారు. అనంతరం సీఎం జగన్ గుంటూరు జిల్లా వైద్య కళాశాలకు చేరుకుని అక్కడ ప్లాటినం జూబ్లీ పైలాన్ ను ఆవిష్కరించారు.
Breaking: ఎన్ కౌంటర్ లో జేఈఎం ఉగ్రవాది హతం