ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది పర్యాటకులకు గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా 20 పర్యాటక ప్రదేశాల్లో 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ లను సీఎం వైఎస్ జగన్ మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇది పోలీస్ శాఖలో మరో సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు.
పోలీసులు మీ స్నేహితులే అనే భావన తీసుకురాగలిగామని, ఇంతకు ముందు జరగని రీతిలో పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. పోలీస్ స్టేషన్ లో రిసెప్షనిస్టులు పెట్టి తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామన్నారు. పర్యాటకుల భద్రత కోసమే ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. యూత్రికులు నిర్బయంగా పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు ఈ పోలీస్ స్టేషన్ లు దోహదపడతాయని తెలిపారు. పర్యాటక ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన కియాస్క్ లు స్థానిక పోలీస్ స్టేషన్ లతో అనుసంధానమై ఉంటాయన్నారు.
స్థానిక పోలీస్ స్టేషన్ లకు అదనపు పోలీస్ స్టేషన్ లుగా పర్యాటక ప్రాంతాల్లో స్టేషన్లు పని చేస్తాయన్నారు సీఎం జగన్. ప్రతి కియాస్క్ లో దాదాపు ఆరు మంది సిబ్బంది షిప్ట్ ల వారిగా విధుల్లో ఉంటారన్నారు. వీరిని పర్యవేక్షించేందుకు ఎస్ఐ, ఏఎస్ఐ స్థాయి అధికారిని నియమించామన్నారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ బూత్ ను సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు. పోలీస్ బూత్ పోటు పది ద్విచక్ర వాహనాలు, రెండు పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ కె రజేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మచిగాన్ యూనవర్శిటీలో కాల్పుల కలకలం .. ముగ్గురు మృతి
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?