CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం సీఎం వైఎస్ ఈ రోజు కడపకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొదటి రోజైన శుక్రవారం కడప అమీన్ పీర్ దర్గాను సందర్శంచారు. దర్గాలో చాదర్ ను సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు జగన్. వాస్తవానికి ఈ నెల 7వ తేదీ నుండి అమీన్ పీర్ దర్గా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఒక్క రోజు ముందుగా అంటే ఈ నేల 6వ తేదీ సీఎం జగన్ కడప పర్యటన ఖరారు అయ్యింది. అదే రోజు అమీన్ పీర్ దర్గాను సందర్శించి చాదర్ ను సమర్పించాల్సి ఉంది.
ఆ తర్వాత తమ సమీప బంధువు, ఆర్ టీ సీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించాల్సి ఉంది. అయితే ఆ రోజు కడప విమానాశ్రయం వద్ద పొగమంచు కారణంగా ఏయిర్ ట్రాఫిక్ క్లీయరెన్స్ రాకపోవడంతో జగన్ కడప పర్యటన రద్దు అయ్యింది. ఇప్పుడు మూడు రోజుల పర్యటన కు కడప వెళ్లిన సందర్బంగా సీఎం జగన్ అమీన్ పీర్ దర్గాను సందర్శించారు. ఈ సందర్బంలో దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ సీఎం జగన్ కు స్వాగతం పలికారు.
అనంతరం పటేల్ రోడ్డు లోని ఆర్ టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి నివాసానికి వెళ్లి నూతన దంపతులను జగన్ ఆశీర్వదించారు. అనంతరం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అప్జల్ ఖాన్ కుమారుడి వివాహ వేడుకకు హజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్ కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.900 కోటడ్ల తో అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
సీనియర్ లకు షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక కామెంట్స్