AP CM YS Jagan: రాష్ట్రంలోని అగ్రవర్ణాల పేదలకు సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ అందించారు. అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలని జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వం (జీఓ ఎంఎస్ నెం.66 2021) ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈ ఉత్తర్వులతో ఇకపై ఎపిలో ఉన్న అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. సీట్లలో మూడవ వంతు ఈడబ్ల్యుఎస్ కోటా కింద పది శాతం అమలు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. వార్షిక ఆదాయం రూ.8లక్షలలోపు ఉన్న వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.
Read More: Union Home ministry: సెక్షన్ 66ఏ కేసులపై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు..!!
ఈ రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగాల్లో వర్తించనున్నాయి. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను ఏపి ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఈ నిబంధనలు సరళతరం చేయడం మూలంగా మరింత ఎక్కువ మంది అగ్రవర్ణ పేదలకు లబ్ది చేకూరనున్నది. ఓబీసీ సర్పిఫికెట్ల జారీకి ఆదాయ పరిమితిని కూడా జగన్ సర్కార్ పెంచింది. గతంలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ కు అనుగుణంగా మెమో జారీ చేసింది. వార్షిక ఆదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాల వారందరికీ ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేయాలని తహశీల్దార్ లకు ప్రభుత్వం ఆదేశించింది.
జగన్ సర్కార్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం పట్ల అగ్రవర్ణ పేదవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో అగ్రవర్ణాల్లోని పేదలకు న్యాయం చేస్తానని జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చారని పలువురు వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఓబీసీ రిజర్వేషన్ లకు సంబంధించి ప్రభుత్వం జివో విడుదల చేయడం పట్ల విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అనంతపురం జిల్లా ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, బ్రాహ్మణ సంఘం నేత ద్రోణంరాజు రవిలు హర్షం వ్యక్తం చేశారు.
sions into Educational Institutions