AP CM YS Jagan: రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు కరోనా బాదితులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్, సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 12వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గత వారం రోజులుగా పదివేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనపు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 1,170 స్పెషలిస్ట్ లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ లు, రెండు వేల మంది స్టాఫ్ నర్సులు, 306 మంది అనస్టీషియా టెక్నీషియన్లు, 300 మంది ఎఫ్ఎన్ఒలు, 300 మంంది ఎంఎన్ వోలు, 300 మంది స్పీపర్లు ఆరు నెలల పాటు కాంట్రాక్ట్ పద్దతిలో నియమించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.