AP CM YS Jagan : రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Peddireddy ramachandra reddy కి జగన్ సర్కార్ Jagan govt మరో కీలక బాధ్యత అప్పగించింది. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సభ్యుడుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని నియమిస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి 29వ సదస్సు ఈ ఏడాది మార్చి 4వ తేదీన తిరుపతి కేంద్రంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జగన్ సర్కార్ సదరన్ జోనల్ కౌన్సిల్ కు ఏపి సభ్యుడుగా పెద్దిరెడ్డి ని నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి నాల్గవ తేదీన తిరుపతిలో జరుగు కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హజరు కానుండగా తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, పుదుఛ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ లెఫ్టనెంట్ గవర్నర్ లు పాల్గొంటారు. ఈ సదస్సులో సుమారు 90 నుండి వంద మంది ప్రముఖులు, అధికారులు హజరు అవుతారు. ఈ సదరన్ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో అతిధ్యం ఇవ్వనున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రభుత్వం కీలక బాధ్యతను అప్పగించింది.
ఈ కౌన్సిల్ సమావేశంకు సంబంధించి అతిధులకు ఆహ్వానం, రవాణా, వసతి, బందోబస్తు వంటి సౌకర్యాలు ఏర్పాటునకు, సమావేశం విజయంతంగా నిర్వహించేందుకు గానూ గత సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.