AP CM YS Jagan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన అధ్యక్షతన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఎంపిలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఒత్తిడి పెంచడం, ప్రత్యేక హోదా, కృష్ణాజలాల వివాదం, ఉమ్మడి ప్రాజెక్టులు కేంద్ర పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్, రుణ పరిమితి తగ్గింపు అంశం, దిశ చట్టం ఆమోదం, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై చర్చించి పలు సూచనలు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Read More: BJP: ఏపి బీజేపీపై అధిష్టానం సవతి తల్లి ప్రేమ..!ఇదిగో రెండవ ఫ్రూవ్..!!
అదే విధంగా పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు అనర్హత పిటిషన్ పై చర్యలకు గట్టిగా పట్టుబట్టాలనే విషయంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. రఘురామ కృష్ణం రాజుపై అనర్హత వేటు వేయకపోతే పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళన చేస్తామని ఇప్పటికే ఆ పార్టీ రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి వెల్లడించి ఉన్నారు.
ఈ సమావేశానికి ముందు వై సీ పీ పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించి అన్ని అంశాలను ఉభయ సభల్లో లేవనెత్తుతామన్నారు. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగిందన్నారు. సీఎం జగన్ దిశానిర్దేశంతో ఉభయ సభల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు.