NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: రాష్ట్ర ప్రభుత్వ తేనీటి విందుకు హజరైన సీజేఐ ఎన్వీ రమణ .. ఎన్వీ రమణకు స్వాగతం పలికిన సీఎం జగన్ దంపతులు

AP CM YS Jagan: ఏపి పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో సీజేఐ కు ఇచ్చిన తేనీటి విందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దంపత సమేతంగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హజరైన సీజేఐ ఎన్వీ రమణ దంపతులకు సీఎం వైఎస్ జగన్, భారతి దంపతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులను సీజేఐ ఎన్వీ రమణకు సీఎం జగన్ పరిచయం చేశారు. ఈ తేనీటి విందులో డిప్యూటి సీఎంలు, మంత్రులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ఏపి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రెండు రాష్ట్రాల న్యాయమూర్తులు పాల్గొన్నారు.

AP CM YS Jagan meets cji justice nv ramana
AP CM YS Jagan meets cji justice nv ramana

 

AP CM YS Jagan: సీజేఐ ఎన్వీ రమణతో సీఎం జగన్ భేటీ

తొలుత కడప జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న సీఎం వైఎస్ జగన్ .. నోవాటెల్ హోటల్ కు వెళ్లి సీజేఐ ఎన్వీ రమణను కలిసి తేనేటి విందుకు ఆహ్వానించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామం జరగకముందు ఆయనపైనే పలు అభియోగాలు చేస్తూ నాటి సీజేఐ జస్టిస్ బొబ్డే  కు సీఎం వైఎస్ జగన్ ఫిర్యాదు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే జగన్ చేసిన అభియోగాలపై సుప్రీం కోర్టు అంతర్గత విచారణ జరిపి ఆ ఆరోపణలు నిరాధారమైనవిగా భావించిన నేపథ్యంలో నాటి సీజేఐ జస్టిస్ బొబ్డే తన తరువాత సీజేఐ గా ఎన్వీ రమణను సిఫార్సు చేయడం, రాష్ట్రపతి ఆమోదంతో ఎన్వీ రమణ ఆ పదవిలో నియమితులు కావడం తెలిసిందే. అయితే జస్టిస్ వెంకట రమణ సీజేఐ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారిగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు వచ్చిన సమయంలో అటు తెలంగాణలో సీఎం కేసిఆర్ స్వాగతం పలికారు. ఏపిలో తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో సీఎం జగన్ గానీ, మంత్రులు గానీ స్వాగతం పలకలేదు. సాధారణ ప్రోటోకాల్ భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలే నాడు సీజేఐ ఎన్వీ రమణకు స్వాగతం పలికారు. ఈ సారి రాష్ట్రానికి విచ్చేసిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున భారీ ఎత్తున స్వాగతం పలకడంతో పాటు తేనేటి విందు ఏర్పాటు చేసి స్వయంగా సీఎం జగన్ దంపతులు సీజేఐ దంపతులను మర్యాదపూర్వకంగా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!