ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్), భారతీ రెడ్డి దంపతులు ఈ రోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం అయ్యారు. విజయవాడలోని రాజ్ భవన్ కు చేరుకున్న సీఎం జగన్ దంపతులకు రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాష్ స్వాగతం పలికారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ మద్య వివిధ అంశాలపై చర్చించారు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాల పురోగతిపై గవర్నర్ కు సీఎం జగన్ వివరించారు. దాదాపు అరగంటకు పైగా వీరిద్దరి మధ్య భేటీ కొనసాగింది.
తొలుత గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను సీఎం జగన్ దుశ్సాలువాతో సత్కరించి శ్రీవెంకటేశ్వరస్వామి వారి జ్ఞాపికను బహుకరించారు. అనంతరం గవర్నర్ కూడా జగన్ కు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. తొలుత రాజ్ భవన్ వద్ద సీఎం జగన్ దంపతులను సాధారణ పరిపాలనా శాఖ రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు. జిల్లా కలెక్టర్ డిల్లీ రావు, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, ఎమ్మెల్సీ తలశిల రఘురాం తదితరులు స్వాగతం పలికారు.
సీఎం జగన్ కీలక ఆదేశాలు .. ఆ కుటుంబాలకు రూ.2వేల తక్షణ సాయం