CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) రేపు (సోమవారం) నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. గత కొద్ది నెలలుగా సంక్షేమ పథకాల పంపిణీలను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం ఈ నెల (అక్టోబర్) లో వైఎస్ఆర్ రైతు భరోసా – సీఎం కిసాన్ నిదులను విడుదల చేయాల్సి ఉంది. ఈ క్రమంలో భాగంగా ఆళ్లగడ్డలో రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ ఉదయం 9 గంటలకు సీఎం జగన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుండి నంద్యాలకు బయలుదేరతారు. ఉదయం 10.15 గంటలకు ఆళ్లగడ్డకు చేరుకుంటారు.
ఆళ్లగడ్డ లోని ప్రభుత్వ జేఆర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు ఉదయం 10.45 గంటలకు హజరై ప్రసంగిస్తారు. అనంతరం బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ రెండో విడత నిధులను విడుదల చేస్తారు. అక్కడ కార్యక్రమం పూర్తి అయిన అనంతరం మధ్యాహ్నం 12.,35 గంటలకు ఆళ్లగడ్డ నుండి సీఎం జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆళ్లగడ్డలో అధికారులు ఏర్పాట్లు చేశారు.
Breaking: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం .. విశాఖ జనవాణి వాయిదా