ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ (గురువారం) పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల లో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి 10 గంటలకు లింగంగుంట్ల చేరుకుంటారు సీఎం జగన్. అక్కడ డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ సెంటర్ ని పరిశీలిస్తారు. అనంతరం సమీపంలోని ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత కావూరు గ్రామంలో సభా ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ముఖ్యమంత్రి జగన్ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తమ నియోజకవర్గానికి సీఎం జగన్ విచ్చేస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజిని, నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన మర్రి రాజశేఖర్ పెద్ద ఎత్తున జన సమీకరణకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు, మంత్రులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్ 12 గంటలకు అక్కడి నుండి బయలుదేరి 12,30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Breaking: బండి సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ .. ఇక జైలుకే