AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం రాత్రి ఫ్రాన్స్ రాజధాని పారిస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ఆయన ప్రత్యేక విమానంలో పారిస్ బయలుదేరారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు పలువురు మంత్రులు వీడ్కోలు పలికారు. బుధవారం ఉదయం 5.10 గంటలకు జగన్ పారిస్ చేరుకుంటారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పారిస్ లోని ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ నందు జగన్ కుమార్తె హర్షారెడ్డి పీజీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సదరు కళాశాలలో జరిగే స్నాతకోత్సవ వేడుకల్లో హజరయ్యేందుకు జగన్ వెళుతున్న సంగతి తెలిసిందే. జగన్ విదేశీ పర్యనటకు ఇటీవలే సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కోర్టు.. జగన్ పారిస్ పర్యటనకు పది రోజుల పాటు అనుమతి ఇచ్చింది. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కాన్వోకేషన్ వేడుకల్లో పాల్గొన్న తరువాత తిరిగి జూలై 2న సాయంత్రం 4 గంటలకు జగన్ పారిస్ నుండి తిరుగు ప్రయాణం అవతారు. 3వ తేదీ ఉదయం 6.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు.