NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: గ్రామ సచివాలయాల పనితీరును మరో సారి ప్రధాని మోడీకి వివరించిన సీఎం వైఎస్ జగన్..!!

AP CM YS Jagan: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మంచి ఫలితాలు అందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్, ఫివర్ సర్వే నిర్వహణలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఉండటం మూలంగా ఒకే రోజు 13 లక్షల పైగా వ్యాక్సిన్లు అందించిన ఘనత ఏపి సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం కోవిడ్ పరిస్థితి, వాక్సినేషన్ అంశాలపై సమీక్ష నిర్వహించగా, సీఎం జగన్ మరో మారు వార్డు, గ్రామ సచివాలయాల గురించి మోడీకి వివరించారు.

AP CM YS Jagan participates pm modi video conference
AP CM YS Jagan participates pm modi video conference

Read More: Amaravati Land scam: అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ ఆరోపణలపై సుప్రీం ఎమన్నదంటే..!?

కోవిడ్ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేసిన సీఎం వైఎస్ జగన్ .. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నామనీ, రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు లేవని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపిలో లేవని పేర్కొన్నారు. అయినప్పటికీ కోవిడ్ ను ఎదుర్కొవడంలో చెప్పుకోదగిన పని తీరు కనబరిచామని వివరించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్ విస్తరణ ను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పని చేశాయన్నారు. ఇప్పటి వరకూ 12 సార్లు ఇంటింటికీ ఫీవర్ సర్వే చేశామన్నారు. లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, ఫోకస్ గా పరీక్షలు చేశామన్నారు. దీని వల్ల కోవిడ్ విస్తరణను అడ్డుకోగలిగామని చెప్పారు. వ్యాక్సినేషన్ అనేది కోవిడ్ కు సరైన మార్గమనీ, దీనికి సంబంధించి కొన్ని కీలక సూచనలు చేస్తున్నామని జగన్ తెలియజేశారు.

రాష్ట్రానికి 1,68,46,210 వ్యాక్సిన్ డోసులు రాగా వాటితో 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగిందన్నారు. వ్యాక్సినేషన్ లో మంచి విధానాల వల్ల ఇచ్చిన దాని కన్నా ఎక్కువ మందికి వేయగలిగామనీ దూబరా అరికట్టామని తెలిపారు. జూలై నెలలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారన్నారు. జూలై నెలలో ప్రైవేటు ఆసుపత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించగా క్షేత్రస్థాయిలో చూస్తే వారికి కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయిన విషయాన్ని తెలియజేశారు. జూలై నెలలో ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమేనని చెప్పారు. ఆసుపత్రిలో వినియోగించకుండా ఉండిపోయిన స్టాకు కోటాను తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహాదపడుతుందని పేర్కొన్న జగన్.. కోవిడ్ నివారణలో అందించే సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు పాటిస్తూ ముందుకు సాగుతామని మోడీకి తెలియజేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju