తాడేపల్లిలోని ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నివాసంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సీఎం జగన్ ఇంటి ఆవరణలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
వ్యవసాయ సామాగ్రి, ఎడ్ల బండ్లు, గడ్డి వాములు, పశు సంపద, కుల వృత్తుల చిత్రాలతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ దంపతులు ముందుగా జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం గోపూజ చేశారు. ఆ తర్వాత బోగి మంటలు వెలిగించిన సీఎం జగన్.. హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు.
ప్రముఖ సంగీత నృత్యకళాకారుడు ఆనంద్ నేతృత్వంలో ఏర్పాట్లు చేసిన శ్రీనివాస కళ్యాణం ప్రదర్సనను సీఎం జగన్ దంపతులు తిలకిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మువీలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన చిన్నారి సింగర్ ప్రకృతి రెడ్డి ..సీఎం జగన్ ఆశీర్వాదం తీసుకున్నది. తదుపరి సీఎం జగన్ దంపతులతో సెల్ఫీ కూడా దిగింది. సింగర్ హారిక, నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు మంచి జోష్ తో పాటలు పాడి ప్రదర్శనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తాడేపల్లి: సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్ జగన్ దంపతులు. #CMYSJagan #Sankranthi2023 pic.twitter.com/vuvVcaEwdC
— YSR Congress Party (@YSRCParty) January 14, 2023
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?