కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం గోపూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. టీటీడీ, దేవాదాయ శాఖ ఆథ్వర్యంలో 2679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమాలను నిర్వహించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగిన గోపూజ మహోత్సవంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్ సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు.
మున్సిపల్ స్టేడియంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను సీఎం జగన్ పరిశీలించారు. గందిరెద్దుల నృత్యాలను జగన్ వీక్షించారు. ప్రతి ఒక్కరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు,. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఈ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీడీ వేదపండితులు, వైసీపీ ఎమ్మెల్యేలు , పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.