25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఆడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్

Share

అనకాపల్లి జిల్లా యలమంచికి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ .. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు (85) భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న తులసీరావు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుండి స్వగ్రామానికి తరలించగా, గురువారం సీఎం వైఎస్ జగన్ యలమంచిలి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

AP CM YS Jagan pay tribute visakha dairy chairman Adari tulasi rao

 

ఈ సందర్భంగా సీఎం జగన్ వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమరనాథ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. అడారి తులసీరావు గత మూడు దశాబ్దాలుగా విశాఖ డెయిరీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఆనంద్ కుమార్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తుండగా, కుమార్తె రమా కుమారి యలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మాజీ మంత్రి మేకతోటి సుచరిత కీలక వ్యాఖ్యలు..క్లారిటీ ఇచ్చేసినట్లే(నా)..? పరమార్ధం ‘పెరుమాళ్ల’కే ఎరుక..!


Share

Related posts

BJP : గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బిజెపి ఓటమి స్వయంకృతాపరాధమేనా!పోస్టుమార్టం ప్రారంభిన కమలనాథులు!

Yandamuri

Telangana Govt: విద్యార్ధులకు గుడ్ న్యూస్ అందించిన తెలంగాణ సర్కార్

somaraju sharma

విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

Teja