AP CM YS Jagan: రాష్ట్ర వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 12 వ వర్థంతి కార్యక్రమాలు అభిమానలు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయిలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, నేతలతో కలిసి నివాళులర్పించి ప్రార్థనలో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల తదితర కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు ఘాట్ వద్ద నివళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రక్తదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను అభిమానులు ఏర్పాటు చేశారు.
కాగా వైఎస్ వర్థంతిని పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదకగా భావోద్వేగంతో ట్వీట్ చేశారు. నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారని అన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలో అలానే నిలిచి ఉన్నాయన్నారు. “నేనే వేసే ప్రతి అడుగులోనూ ప్రతి ఆలోచనలోనూ నాన్న స్పూర్తి ముందుండి నడిపిస్తోంది” అని జగన్ పేర్కొన్నారు. జగన్మోహనరెడ్డి ట్వీట్ కు వేలాది మంది అభిమానులు లైక్ లు ఇస్తూ రీట్వీట్ చేస్తున్నారు.
Read More:YSR 12th death anniversary: విజయమ్మ పెట్టిన పరీక్ష..! వైఎస్ సహచరుల అంతర్మధనం..!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?