NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: రేపటి ఏపి సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా..! ఎందుకంటే..?

AP CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ రేపటి పోలవరం పర్యటన రద్దు అయ్యింది. తొలుత రేపు సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారని అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే అకస్మాత్తుగా ఆయన పర్యటన వాయిదా పడింది. సీఎం పర్యటనకు పోలవరం ప్రాజెక్టు వద్ద అన్ని ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో ఒక్క రోజు ముందుగా సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంఒ వెల్లడించింది.

AP CM YS Jagan polavaram visit postponed
AP CM YS Jagan polavaram visit postponed

ఈ నెల 14వ తేదీన సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడం లేదని సీఎం కార్యాలయం నేడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు సీఎంఒ నుండి సమాచారం అందింది. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష జరిపి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం సీఎం పర్యటన రద్దు అయిన నేపథ్యంలో తిరిగి ఎప్పుడు పోలవరం కు వెళతారు అనేది తదుపరి నిర్ణయించనున్నారు. మరో పక్క సీఎం పర్యటనకు ప్రాజెక్టు వద్ద ముమ్మర ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో చివరి నిమిషంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో కారణం ఏమై ఉందని ఆలోచనలో పడ్డారు.

సీఎం పర్యటన వాయిదాకు ప్రధాన కారణం ఏమిటంటే.. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపిలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  పోలవరం పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడం సురక్షితం కాదని అధికారులు తెలియజేయడం వల్లనే సీఎం జగన్ పోలవరం సందర్శన వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరో పక్క సీఎం పర్యటనకు వస్తున్నారని తెలియడంతో ఇప్పటికే అదికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రయల్ రన్ పనులను సీఇ సుధాకర్ బాబు, ఎస్ఈ నర్శింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ జీఎంలు సతీష్ బాబు, బెకెం ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్టు ఇన్ చార్జి ఎ నరేంద్ర పరిశీలించారు. స్పిల్ వే బ్రిడ్జ్ పై 45 కాంక్రీట్ స్లాబులు వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 42 పూర్తి అయ్యాయి. అలాగే 49 ట్రూనియం బీమ్ లు పూర్తి అయ్యాయి. స్పిల్ వే బ్రిడ్జ్ లో 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ 28 గేట్ల అమరిక పూర్తి  అయ్యింది. కాగా తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత వచ్చే వారంలో సీఎం జగన్ ప్రాజెక్టు సందర్శన ఉండవచ్చని భావిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?