ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) మహాసభల ఆహ్వానం అందింది. నాటా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, నాటా సభ్యులు సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. నాటా మహాసభకు హజరు కావాలంటూ ఆహ్వానాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ను నాటా కార్యవర్గ సభ్యులు దుశ్సాలువాతో సత్కరించారు. అమెరికాలోని డల్లాస్ వేదిగా 2023 జూన్ 30వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకూ నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) మహాసభలు జరగనున్నాయి. నాటా కార్యవర్గం ఆహ్వానంపై తప్పక హజరు అవుతానని వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ సందర్భంలో నాటా సభ్యులను సీఎం జగన్ పేరుపేరునా పలకరించారు.