AP CM YS Jagan : గ్రామాల్లో ప్రజలకు మంచిగా సేవలు అందించిన వాలంటీర్లకు సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలతో ఉగాది నాడు సత్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రణాళికా శాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలని అన్నారు. అదికారులు నిర్దేశిత లక్ష్యాలపై దృష్టి సారించాలన్నారు. గ్రామ సచివాలయంలో కూడా డేటా క్రోడీకరణ ఒకరికి అప్పగించాలని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ కు ఈ బాద్యతలు అప్పగించాలని, మండల స్థాయిలో ఒ ఉద్యోగికి దీన్ని పర్యవేక్షిస్తారన్నారు.
అదే విధంగా రైతు భరోసా కేంద్రాల కేంద్రాలలో ఉన్న డేటాను సేకరించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో చేస్తున్న ఇ క్రాపింగ్ లాంటి డేటా ను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ వ్యవస్థ వద్ద ఇంటర్నెట్ సరిగ్గా పని చేస్తున్నదా లేదా అన్న అన్నడేటా ఎప్పటికప్పుడు తీసుకోవాలనీ, దీని వల్ల పాలన, పనితీరు సమర్థవంతంగా ముందుకు సాగుతుందని జగన్ స్పష్టం చేశారు. సుస్థిర సమగ్రాభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని సీఎం జగన్ కు అదికారులు వివరించారు. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ విభాగాలు సహా ప్రపంచ స్థాయి సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కో వంటి సంస్థలతో కూడా కలిసి పని చేయాలని జగన్ సూచించారు.
వివిధ కార్యక్రమాల అమలులో మనం ఎంత వరకు లక్ష్యాలను చేరుకున్నాం, లోపాలు ఏమిటో గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని జగన్ సూచించారు. ఈ సమావేశంలో ప్రణాళికా శాఖ ఎక్స్ అఫీషియో సెక్రటరీ విజయ్ కుమార్, కనెక్ట్ టు ఆంధ్ర సీఈఓ వి కోటేశ్వమ్మ, అర్టీజీఎస్ సీఈఓ విద్యాసాగర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.