AP CM YS Jagan: ఏపిలో వ్యవసాయ, అనుబంధ శాఖలలో నిర్మాణ మవుతున్న కీలక ప్రాజెక్టులను వేగవంతం చేసి నిర్ణీత సమయాల్లో పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం జగన్ వ్యవసాయ, అనుబంధ శాఖలు, పశు సంవర్ధక శాఖలపై తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మల్టీ పర్పస్ సెంటర్లు, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, ఫుడ్ ప్రాససింగ్, ఫిషింగ్ హార్బర్లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వీటన్నింటికి కోసం దాదాపు రూ.16,236 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.
రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్ హార్బర్లలో నాలుగు చోట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని అధికారులు తెలియజేయగా మిగిలిన నాలుగు చోట్ల కూడా పనులు త్వరగా మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. ఫుడ్ ప్రాససింగ్ విధానాన్ని బలోపేతం చేయడం ద్వారా రైతులకు అండగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతులకు కనీస గిట్టుబాట ధర కల్పించడంతో పాటు ఆహార రంగంలో పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి తదితర అంశాల్లో కూడా మేలు జరుగుతుందని చెప్పారు.ఈ ప్రాససింగ్ యూనిట్ల ద్వారా రైతుల ఉత్పత్తులు నాణ్యమైన పద్ధతుల్లో వియోగదారులకు చేరతాయన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో భారీ ఫిషింగ్ హార్బర్ లు ఫిష్ ల్యాండ్ సెంటర్ ల పై సమీక్ష నిర్వహించిన జగన్ చేపలు, రొయ్యల ప్రాససింగ్ యూనిట్ల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. అక్వా హబ్స్ నిర్మాణం తదితర నిర్మాణాలకు రూ.3,997 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వ అంచనా. రాష్ట్రంలో 33 చోట్ల సీడ్ కం మిల్లిట్ ప్రాససింగ్ యూనిట్ల నిర్మాణానికి తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు.