CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి హోంశాఖ పై సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలనీ, దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే మహిళా పోలీసులకు కఛ్చితమైన ప్రోటోకాల్ ఉండాలని తెలపారు. మహిళా పోలీసుల ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలని, దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలని తెలిపారు.
దిశ యాప్ మీద మరో సారి డ్రైవ్ నిర్వహించాలని అదేశించారు సీఎం జగన్. ప్రతి ఇంట్లో కూడా ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా లేదా అన్ని దానిపై మరో సారి పరిశీలన చేయాలన్నారు. దిశ యాప్ వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రతి ఇంటికి కరపత్రాలను పంపిణీ చేయాలన్నారు. మాదక ద్రవ్యాలను పూర్తిగా నివారించాలన్నారు. మదక ద్రవ్యాల రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపాలని ఆదేశించిన సీఎం జగన్.. డ్రగ్ పెడలర్స్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. వారికి శిక్షలు పెంచేలా ఆలోచనల చేయాలన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక దిశ పోలీస్ స్టేషన్ ఉండాలని ఆదేశించారు.
కాగా సీఎంఓ అధికారులతో అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రైతులకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ఆదేశించారు. పంటనష్టపోయిన రైతుల్లో ఏ ఒక్కరికీ పరిహారం రాలేదనే మాట రాకూడదన్న సీఎం.. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. రబీ ధన్యాం కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అజ్ఞాతంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి.. పేరు మార్చి ప్రత్యేక ఫైట్ లో చెన్నైకి..?