AP CM YS Jagan: ఇటీవల రాష్ట్రంలో మహిళలు, యువతులపై అత్యాచారాలు , అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం మహిళల భద్రత పై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. దిశ యాప్ పై పూర్తి చైతన్యం కల్గించాలన్నారు. యాప్ ఎలా వాడాలన్న విషయంపై పూర్తి అవగాహన కల్గించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి అక్కా చెల్లెమ్మల ఫోన్ లలో యాప్ ను డౌన్ లోడ్ చేసేలా చూడాలన్నారు.
తొలుత మహిళా పోలీసులకు, వలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు అవగాహన కల్గించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్ ఎలా ఉపయోగించాలన్న దానిపై అవగాహన కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. కళాశాలలు, విద్యాసంస్థల్లో కూడా విద్యార్థినులకు యాప్ వినియోగంపై అవగాహన కల్గించాలన్నారు. ఈ చర్యల వల్ల దిశ యాప్ వినియోగం పెరుగుతుందన్నారు. మహిళలు, యువతులను ఆదుకునేలా ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాగం సిద్ధం కావాలన్నారు. ఎక్కడైనా సంఘటన జరిగితే దిశ పోలీస్ స్టేషన్ లు, స్థానిక పోలీసు స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్దం చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ లలో అవసరమైన పెట్రోలింగ్ వాహనాలను సమకూర్చుకోవాలన్నారు.
ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?