AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శుక్రవారం పోలవరం సహా రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను ఎక్కడా ఆలస్యం చేయవద్దని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుండి రావాల్సిన బిల్లులపై సమీక్ష జరిపారు. ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు వివరిస్తూ దాదాపు రూ.1600 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఢిల్లీకి వెళ్లి వెంటనే పెండింగ్ బిల్లులు క్లీయర్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలవరంలో స్పిల్ వే కాంక్రీట్ పనుల్లో 91 శాతం పూర్తి అయ్యాయనీ, ఈ నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తి అవుతాయని అధికారులు వివరించారు. కాఫర్ డ్యామ్ లో 1.2 రీచ్ లు జూన్ నెలాఖరు నాటికి, 3,4 రీచ్ పనులు జూలై నెలాఖరు నాటికి నిర్ణీత ఎత్తుకు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు.
Read More: Man Chews Snake: అతను పామును నమిలి మింగేశాడు..! ఎందుకో తెలిసి అందరూ షాక్ అయ్యారు..!!
రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులు, పల్నాడు ప్రాంత కరువు నివారణ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జూలై 31 నాటికి పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. వంశధారపై నేరడి బ్యారెజీ నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. సంగం బ్యారేజీ పనులు 84 శాతం పూర్తి అయ్యాయనీ, జూలై 31 నాటికి మొత్తం పనులు పూర్తి అవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.