YCP MLC Anantababu: సాధారణంగా అధికార పార్టీ నేతలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలంటే పోలీసులకు కొంత ఇబ్బందే. ఉన్నతాధికారుల నుండి వత్తిడి ఉంటుందని కేసు విషయంలో తాత్సారం చేస్తుంటారు. అయితే కొద్ది రోజులుగా ఏపీలో అధికార పార్టీ నేతలపైనా కేసులు నమోదు అవుతున్నాయి. పలు కీలకమైన కేసుల్లో సీఎం జగన్మోహనరెడ్డి.. నిందితులు సొంత పార్టీ వారు అయినా ఉపేక్షించవద్దని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించారుట. ఆ క్రమంలో సీఎం సొంత జిల్లా కడపలో ఇటీవల జగన్ సమీప బంధువుపైనా ఓ నిర్మాణ సంస్థ యజమానిని బెదిరించిన కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ తరువాత జిల్లా బహిష్కరణ వేటుకు చర్యలు చేపట్టారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YCP MLC Anantababu: ఎమ్మెల్సీ అనంతబాబు పై కేసు నమోదు
తాజాగా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ ఆనంత ఉదయ్ భాస్కర్ బాబు (అనంతబాబు) విషయంలోనూ సీఎం జగన్ సీరియస్ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఆయనపై హత్య నేరంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టునకు రంగం సిద్ధం చేశారు. ఆనంత బాబు అరెస్టునకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తొంది. ఎమ్మెల్సీ ఆనంత బాబు డ్రైవర్ గా పని చేసిన సుబ్రమణ్యం మృతిపై కుటుంబ సభ్యులు మొదటి నుండి అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పని ఉందని తీసుకువెళ్లి కారులో మృతదేహాన్ని కారులో తీసుకువచ్చారని, యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పారన్నారు.
Read more: Breaking: గ్యాస్ సిలెండర్ పై భారీ గా సబ్సిడీ..కేంద్రం కరుణ ఆ లబ్దిదారులకే
ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా ఇతర రాజకీయ పక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ప్రభుత్వ పెద్దల సూచనలతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. నిన్న రాత్రి కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి డ్రైవర్ సుబ్రమణ్యం మృతి కేసులో ఏ 1 గా ఎమ్మెల్సీ ఆనంత బాబును చేర్చడం జరిగిందని చెప్పారు. ఆనంత బాబు అరెస్టునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దాన్ని హత్య కేసుగా ఆల్టర్ చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?